కష్టాలు చెప్పుకున్న మధ్యాహ్న భోజన కార్మికులు

1 Jul, 2018 14:44 IST

ముమ్మిడివరం: టిడిపి ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద వాపోయారు. ముమ్మిడివరం నియోజవర్గంలో ఆదివారం నాడు ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న జగన్ ను కలుసుకుని వీరు తమ గోడు వెలిబుచ్చుకున్నారు. చెల్లించాల్సిన వేతనాలు ఇవ్వకుండా తమ బతుకులను వీధుల పాలు చేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.