పాదయాత్రతో దెందులూరు మండలం చల్ల చింతలపూడిలో అడుగుపెట్టిన
ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ కు సాదర స్వాగతం లభించింది. గ్రామ పొలిమేరల్లోనే
జననేత రాకకోసం వేచి చూసి, గ్రామంలో అడుగిడగానే పెద్ద ఎదురేగారు. తమ సమస్యలను,
బాధలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తనను చూడటానికి వచ్చిన ఒక వృద్ధురాలి పాదరక్షలు
జారిపోయి ఇబ్బందులు పడుతుండటాన్ని గమనించిన జననేత స్వయగా ఆమెకు చెప్పు తొడగడం,
స్థానికుల హృదయాలను హత్తుకుంది.