పార్టీ జెండా ఆవిష్కర‌ణ‌

2 Jan, 2018 13:26 IST
చిత్తూరు: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవారం చిత్తూరు జిల్లా వాల్మీకిపురం చేరుకున్న రాజన్న తనయుడికి స్వాగతం పలికేందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. అశేషంగా వచ్చిన జనంతో వాల్మీకిపురం జనసంద్రాన్ని తలపించింది. అనంత జనవాహిని సాక్షిగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  జెండాను వైయ‌స్‌ జగన్‌ ఆవిష్కరించారు.