వైయస్ జగన్ను కలిసిన మత్స్యకారులు
30 Dec, 2018 15:41 IST
ఫిషింగ్ హార్బర్, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని వినతి..
శ్రీకాకుళంః ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్ను కలిసిన నువ్వులరేవు గ్రామ మత్స్యకారులు తమ సమస్యలు చెప్పుకున్నారు.టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీలు పేట్రేగిపోతున్నాయని ఫిర్యాదు చేశారు. చేపల వేట ఇతర రాష్ట్రాలకు వలసపోవాల్సి వస్తుందన్నారు. తమకు ఫిషింగ్ హార్బర్,కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు.వైయస్ఆర్ హయాంలో తమను ఓసి కేటగిరి నుంచి బిసి కేటగిరిలోకి చేర్చి, తమకు ఇళ్లు మంజూరు చేశారని తెలిపారు. ఆయన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.