వైయస్‌ జగన్‌ను కలిసిన మహిళా రైతులు

2 Dec, 2017 12:44 IST
కర్నూలు: ఆరుగాలం కష్టించి పంటసాగు చేస్తే ప్రభుత్వం పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని రాతనలో మహిళా రైతులు వైయస్‌ జగన్‌కు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పత్తికొండ నియోజకవర్గంలో రాతన చేరుకున్న ప్రజా సంకల్పయాత్రకు మ హిళా రైతులు తరలివచ్చారు. ఈ సందర్భంగా జననేతను కలుసుకొని తమ బాధను చెప్పుకున్నారు. పత్తి పంటకు సరైన మద్దతు ధర లేదని వాపోయారు. ఈ మేరకు స్పందించిన వైయస్‌ జగన్‌ ఒక సంవత్సరంలో ప్రజల ప్రభుత్వం వస్తుందని, అధికారంలోకి వచ్చిన తరువాత రైతు పండించిన పంటలకు రేట్‌ కార్డులు అందజేస్తామన్నారు. అప్పటి వరకు ఎవరూ అధైర్యపడొద్దని, త్వరలో మంచి రోజులు వస్తాయని భరోసా ఇచ్చారు.