నష్టాల్లో ఉన్న ప్రతి చక్కెర ఫ్యాక్టరీని ఆదుకుంటాం
29 Aug, 2018 13:28 IST
వైయస్ జగన్ మోహన్ రెడ్డి
విశాఖ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మూతపడ్డ చక్కెర ఫ్యాక్టరీలన్నింటినీ తెరిపిస్తానని వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం ప్రజా సంకల్ప యాత్రలో చెరకు రైతులు వైయస్ జగన్ను కలిశారు. ఈ సందర్భంగా నష్టాల్లో ఉన్న చక్కెర కర్మాగారాలన్నింటినీ అన్ని విధాల ఆదుకుంటామని జననేత పేర్కొన్నారు. వైయస్ జగన్ హామీతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.