వైయస్ జగన్ను కలిసిన రైతులు
23 Apr, 2018 09:32 IST
కృష్ణా జిల్లా: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్రగా బయలుదేరిన వైయస్ జగన్ మోహన్ రెడ్డిని సోమవారం కృష్ణా జిల్లా రైతులు అగిరిపల్లి వద్ద కలిశారు. ఈ సందర్భంగా తాము పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో వ్యవసాయం భారంగా మారిందని వాపోయారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్ రైతులకు భరోసాకల్పించారు. మరో ఏడాది ఓపిక పడితే మంచి రోజులు వస్తాయని హామీ ఇచ్చారు.