వర్షంతో పాదయాత్రకు అంతరాయం
15 Jul, 2018 10:55 IST
అనపర్తి: ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి 213 నాటి పాదయాత్రకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ప్రజా సంకల్పయాత్ర కొనసాగుతోంది,ఆదివారం ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో పాదయాత్ర ప్రారంభం కాలేదు. అయితే వైయస్ జగన్ ను కలుసుకుని తమ సమస్యలు వివరించడానికి భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. వర్షంలోనే వీరందరినీ జగన్ పలకరిస్తూ భరోసా ఇస్తున్నారు. కాగా వర్షం తగ్గిన వెంటనే పాదయాత్ర తిరిగి ప్రారంభం అవుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు.