సీపీఎస్ విధానం రద్దు చేయాలి
19 Nov, 2017 17:25 IST
కర్నూలు: కాంట్రీబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు చేయాలని సీపీఎస్ ఉద్యోగులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కోరారు. బనగానపల్లెలో ఆదివారం సీపీఎస్ ఉద్యోగులు వైయస్ జగన్ను కలిశారు. ఈ విధానం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ సానుకూలంగా స్పందించారు. మన ప్రభుత్వం రాగానే ఈ విధానం రద్దు చేస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు.