ప్రభుత్వం టీచర్ పోస్టులను భర్తీ చేయడం లేదు
1 Dec, 2017 16:10 IST
కర్నూలు:
చంద్రబాబు హయాంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని బీఈడీ విద్యార్థునులు వైయస్ జగన్మోహన్రెడ్డి ఎదుట మొరపెట్టుకున్నారు. తమ సమస్యను చెప్పుకునేందుకు వారంతా ప్రజా సంకల్పయాత్రకు తరలివచ్చారు. ఈ సందర్భంగా టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయడం లేదని వాపోయారు. బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టులకు అర్హులుగా ప్రకటించాలని కోరారు. ఈ మేరకు స్పందించిన వైయస్ జగన్ ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తానని హామీ ఇచ్చారు.