బాడంగిలో వైయస్‌ఆర్‌ సీపీ జెండా ఆవిష్కరణ

16 Oct, 2018 12:01 IST
విజయనగరం: పాదయాత్రగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని జనం అక్కున చేర్చుకుంటున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో 287వ రోజు ప్రజా సంకల్పయాత్ర బాడంగి మండలం లక్ష్మీపురం క్రాస్‌ నుంచి ప్రారంభమైంది. జననేతకు ప్రజల బ్రహ్మరథం పట్టారు. బాడంగిలో వైయస్‌ జగన్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అక్కడి నుంచి చిన్న భీమవరం క్రాస్, పెద్ద భీమవరం వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది.