ఆర్టిస్టులను ఆదుకోవాలని వినతి
2 Mar, 2018 14:35 IST
ప్రకాశం: ఆర్టిస్టులను ఆదుకోవాలని వైయస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శుక్రవారం ప్రకాశం జిల్లా ఆర్టిస్టుల అసోసియేషన్ నాయకులు వైయస్ జగన్ను కలిశారు. ఇతర ప్రాంతాల నుంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులను పిలిపించుకొని చిన్న ఆర్టిస్టుల కడుపు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు విన్న వైయస్ జగన్ రాజన్న రాజ్యం రాగానే ఆర్టిస్టులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.