జననేతను కలిసిన అర్చకులు

7 May, 2018 14:12 IST

గుడివాడ: ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని అర్చక సమాఖ్య ప్రతినిధులు కలుసుకుని తమ సమస్యలను వివరించారు. అర్చకులు సంక్షేమానికి వినియోగించాల్సిన నిధులు దుర్వినియోగం అవుతున్నాయని వారు ఈ సందర్భంగా తెలిపారు. అంతకు ముందు అర్చకులు వైయస్ జగన్ ను శాలువతో సత్కరించి , వేద మంత్రాలతో ఆశీర్వదించారు.