మునబోలుపాడుకు చేరుకున్న జననేత
10 Feb, 2018 12:38 IST
కావలి:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర కావలి నియోజకవర్గం మునబోలుపాడుకు చేరుకుంది. దుండిగం క్రాస్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర దుండిగం, ఐతంపాడు మీదుగా మునబోలుపాడు చేరుకుంది. ఈ సందర్భంగా మునబోలుపాడులో వైయస్ జగన్కు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. మునబోలుపాడులో జననేత దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహంతో పాటు పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు.