పర్ణశాల నుంచి 150వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
1 May, 2018 09:39 IST
కృష్ణా జిల్లా : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 150వ రోజు మంగళవారం ఉదయం గూడూరు మండలం పర్ణశాల నుంచి ప్రారంభమైంది. చిట్టి గూడూరు, గూడూరు, రామరాజు పాలెం క్రాస్ల మీదుగా మచిలీపట్నం నియోజకవర్గంలోని సుల్తా నగరంలోకి ప్రవేశించనుంది. అక్కడి నుంచి మచిలీపట్నం చేరుకుని సాయంత్రం కోనేరు సెంటర్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వైయస్ జగన్ పాల్గొని ప్రసంగిస్తారు.