143వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
23 Apr, 2018 09:04 IST
కృష్ణా : వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. 143వ రోజు చిన్న అగిరిపల్లి నుంచి సోమవారం ఉదయం వైయస్ జగన్ పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి తోటపల్లి చేరుకొని మధ్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు. పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 2.45లకు ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి గొల్లన్నపల్లి, చిక్కవరం క్రాస్ల గోపవరపు గూడెం వరకు కొనసాగుతుంది.