129వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
5 Apr, 2018 11:06 IST
గుంటూరు : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. గురువారం ఉదయం వేజెండ్ల శివారు నుంచి వైయస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి వడ్లమూడి చేరుకుని ప్రజలతో మమేకమవుతారు. అనంతరం పాలపూడి క్రాస్, గరువుపాలెంల మీదుగా శేకూరు క్రాస్ వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతుంది.