8 గంటల పని దినం అమలు చేయాలి

24 Apr, 2018 16:32 IST

విజయవాడ:  8 గంటల పని దినం కల్పించాలని 108 ఉద్యోగులు వైయస్‌ జగన్‌ను కోరారు. ప్రతి రోజు 12 గంటల పాటు మాతో పని చేయించుకుంటూ శ్రమ దోపిడీ జరుగుతుందన్నారు. గన్నవరం నియోజకవర్గంలో మంగళవారం 108 ఉద్యోగులు వైయస్‌ జగన్‌ను కలిశారు. వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా పెంచలేదన్నారు.