ప్రారంభమైన 106వ రోజు ప్రజా సంకల్పయాత్ర
7 Mar, 2018 10:27 IST
ఒంగోలు: ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేటికి 106వ రోజుకు చేరుకుంది. ఈ రోజు వైయస్ జగన్ తన పాదయాత్రను ఇంకొల్లు శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి హనుమెజిపాలెం, జరుబులవారిపాలెం, కొడవలివారి పాలెం, కేశవరపుపాడు, రంగప్పనాయుడు పాలెం క్రాస్ రోడ్డు, నందిగుంటపాలెం మీదుగా సంతరావు వరకు పాదయాత్ర చేయనున్నారు. సంతరావులో జననేత ప్రజలతో మమేకం కానున్నారు.