వైయస్ఆర్ కుటుంబానికి విశేష స్పందన 4500 మంది సభ్యత్వం
16 Sep, 2017 18:32 IST
సంతమాగులూరు (ఒంగోలు)
: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు ప్రజల్లోకి బాగా వెళ్లాయని, అందులో భాగంగానే వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమానికి విశేష స్పందన వస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంతమాగులూరు మండల నాయకుడు యర్రంరెడ్డి బ్రహ్మారెడ్డి అన్నారు. గత రెండు రోజుల నుంచి మండలంలో చేపట్టిన వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమానికి సంబంధించి శనివారం ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 4500 మంది సభ్యత్వం తీసుకున్నారన్నారు. బూత్ స్థాయిలో అధ్యక్షులందరూ ప్రతి ఇంటికీ తిరిగి వారి వివరాలు సేకరిచంటతో పాటు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకుంటున్నారన్నారు.