వైయస్సార్సీపీ శ్రేణులకు జన నీరాజనం

19 Aug, 2016 15:34 IST

విశాఖపట్నంః వైయస్సార్సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం మహోద్యమంలా కొనసాగుతోంది. గడపగడపలో వైయస్సార్సీపీ శ్రేణులకు ప్రజలు నీరాజనం పడుతున్నారు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ మళ్ల విజయప్రసాద్ 45వ వార్డులో పర్యటించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. 


మరోవైపు, వైయస్సార్సీపీ నేత జీవీ రెడ్డి లక్ష్మీనగర్ లో గడపగడపలో పర్యటించారు. బాబు మోసాలను ప్రజలకు వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిన చంద్రబాబుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.