ఉత్సాహంగా `వైయస్ఆర్ కుటుంబం`
23 Oct, 2017 18:28 IST
కొమ్మాది (విశాఖ): జీవీయంసీ నాల్గవవార్డు కొమ్మాది ఎస్సీ కాలనీలో వైయస్ఆర్ కుటుంబం ఉత్సాహంగా సాగింది. వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు గుంటుబోయిన శ్రీనివాసయాదవ్, సియాద్రి కనకరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైఫల్యాలతో పాటు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలను గడపగడపకు వెళ్ళి వివరించారు. రాజన్న రాజ్యం జగనన్నతో సాధ్యమన్నారు. కార్యక్రమంలో నాయకులు శివరెడ్డి, అశోక్, కళ్యణ్ తదితరులు పాల్గొన్నారు.