రోగాల బారిన పడుతున్నాం
17 Nov, 2016 16:14 IST
విశాఖపట్నం))మురుగు నీరు నిల్వ ఉండడంతో రోగాల బారిన పడుతున్నాం. తమ ఇబ్బందులను పాలకులు పట్టించుకోవడం లేదని మహిళలు వాపోయారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ 42వ వార్డులో గడపగడపలో పర్యచించారు. ఈ సందర్భంగా జనం తమ సమస్యలను ఏకరువు పెట్టారు. చంద్రబాబు మోసపూరిత హామీలపై ప్రజలకు కరపత్రాలు అందించి మార్కులు వేయించారు. ప్రజల్ని మోసగించడమే పనిగా టీడీపీ పాలన సాగుతోందని విజయప్రసాద్ విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రులు సంక్షేమ పథకాలను విస్మరించి మభ్యపెడుతూ కాలం వెళ్లదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు.