అధ్వాన్నపు రోడ్లు..అస్తవ్యస్త పారిశుధ్యంతో అవస్థలు

7 Jun, 2017 15:21 IST

ధర్మవరంః అధ్వాన్నపు రోడ్లు, అస్తవ్యస్త పారిశుధ్యంతో అవస్థలు పడుతున్నాం. అన్ని అర్హతలున్నా పింఛన్లు మంజూరు చేయడం లేదు. ఇళ్లు ఇవ్వడం లేదంటూ ముదిగబ్బ మండలంలోని పలు గ్రామాల ప్రజలు స్థానిక నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి మొరపెట్టుకున్నారు. గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమంలో భాగంగా కేతిరెడ్డి స్థానికంగా పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ప్రజలతో మార్కులు వేయించారు. తమకు ఏ ఒక్కసంక్షేమ పథకం అందడం లేదని ప్రజలు కేతిరెడ్డి వద్ద ఏకరవు పెట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.