బాబు వైఫల్యాలను ప్రజలే ఎండగట్టాలి
28 Sep, 2016 18:26 IST
నంద్యాల(నూనెపల్లి): సీఎం చంద్రబాబు వైఫల్యాలను ప్రజలే ఎండగట్టాలని నంద్యాల నియోజవకర్గ వైయస్సార్సీపీ ఇంచార్జీ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఆయన విజయభాను కాటన్మిల్లు, సాదిక్నగర్, ఆర్ఎఫ్ రోడ్డు, సాయిబాబానగర్, విద్యానగర్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి చంద్రబాబు మోసాలను వివరించారు. అనంతరం వంద ప్రశ్నలతో కూడిన ప్రజాబ్యాలెట్ను ప్రజలకు అందజేసి బాబు పాలనపై మార్కులు వేయించారు.