ప్రకాశంః హెచ్ ఎం పాడు మండలం, వేములపాడు గ్రామంలో కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ గడప గడపకు వైయస్సార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వ అవినీతి పాలనను ఎండగట్టారు.
మరోవైపు, బేస్తావారి పేట మండలం జే.సి.అగ్రహారం పంచాయితీ కొత్త మల్లాపురం గ్రామంలో గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జి ఐ.వి.రెడ్డి గడప గడప కు వై.యస్.ఆర్ కాంగ్రేస్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజాబ్యాలెట్ పంపిణీ చేశారు. ప్రభుత్వం నిరంకుశ పాలనను ప్రజలకు వివరించారు.