మాట తప్పిన బాబుకు పాలించే అర్హత లేదు

31 Oct, 2016 16:11 IST
విజయనగరం(కురుపాం))ప్రజలను వంచించడం చంద్రబాబు నైజమని కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి విమర్శించారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో పర్యటించారు. ఈసందర్భంగా స్థానికులు తమ సమస్యలు మొరపెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా ఇంతవరకు గ్రామాల్లో బాబు ఒక్క సమస్య పరిష్కరించలేదని ఎమ్మెల్యే దుయ్యబట్టారు. ఇచ్చిన మాటపై నిబద్ధత, విశ్వాసం లేని చంద్రబాబుకు పాలించే అర్హత లేదన్నారు. ప్రజాసమస్యలు పట్టించుకోని ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.