ప్రకాశంః కనిగిరి నియోజకవర్గం పామూరు టౌన్ 5వ వార్డులోని సుబ్బరామయ్యవీధి, వడ్డెరపాలెం,రామ్ నగర్ లో నియోజకవర్గ ఇంచార్జ్ బుర్రామధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో గడప గడపకు వైయస్సార్ కార్యక్రమం జరిగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మధుసూదన్ యాదవ్ ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ దుర్మార్గపు, నిర్లక్ష్యపు పాలనను ఎండగట్టారు.