పూటకో మాట చెబుతున్న చంద్రబాబు

16 Jul, 2016 21:19 IST

తిరుపతి: తిరుపతిలోని ఎస్‑టీవీ నగర్‑లో గడప గడపకు వైఎస్ఆర్ కార్యకక్రమంలో వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నయవంచకుడని, పచ్చి అబద్దాలతో అధికారంలోకి వచ్చాడని, ఇప్పుడు పూటకో మాట చెబుతున్నాడని ఆయన విమర్శించారు. చంద్రబాబు మాయమాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలులేరని అన్నారు. ఒక్క హామీని కూడా నెరవేర్చని చేతగాని ముఖ్యమంత్రి చంద్రబాబు అని భూమన విమర్శించారు. ప్రజల తరఫున వైఎస్ఆర్ సీపీ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని చెప్పారు.