అబద్దాలు చెప్పడంలో చంద్రబాబుకు డాక్టరేట్
28 Sep, 2016 18:24 IST
కర్నూలు సీక్యాంప్: అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబుకు సాటిలేరని ఆయనకు డాక్టరేట్ ఇవ్వవచ్చని కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ విమర్శించారు. గడపగడపకూ వైయస్సార్ కార్యక్రమంలో భాగంగా ఆయన కర్నూలు అర్బన్ ప్రాంతంలో పర్యటించారు. ఈ సంద్భంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్లి వంద ప్రశ్నలతో కూడిన ప్రజాబ్యాలెట్ను అందజేసి చంద్రబాబు మోసపూరిత పాలనపై మార్కులు వేయించారు.