చంద్రబాబుకు మతి భ్రమించింది...
19 Nov, 2018 17:43 IST
వైయస్ఆర్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
తూర్పుగోదావరిః చంద్రబాబు మతి లేకుండా మాట్లాడుతున్నారని వైయస్ఆర్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.రాష్ట్రంలోని కేంద్ర దర్యాప్తు సంస్థలను రాకుండా అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. న్యాయస్థానాలపై మాకు పూర్తి నమ్మకం ఉందన్నారు.వైయస్ జగన్పై హత్యాయత్నం వెనుక ఎవరున్నారనేది త్వరలో బయటపడుతుందన్నారు.