ఢిల్లీ : ప్రత్యేక హోదా సాధన కోసం 3 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైయస్ ఆర్ కాంగ్రెస్ ఎంపిల బృందంలోని సభ్యులు వై వి సుబ్బారెడ్డి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. ఆదివారం రాత్రి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ల బృందం ఆయన దీక్షవిరమించాలని సూచించారు. అయినా మొక్కవోని పట్టుదలతో తాను దీక్షలోనే కొనసాగుతానని స్పష్టం చేస్తూ దీక్షను కొనసాగిస్తున్నారు.