ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు పోరుబాట

19 Dec, 2017 11:31 IST


 వైయ‌స్ఆర్ జిల్లా  : ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి పోరుబాట పట్టారు.  ప్రజలకు ఉచితంగా ఇళ్లు కట్టించి ఇవ్వాలని కోరుతూ 48 గంట‌ల నిరాహార‌దీక్ష‌కు ఎమ్మెల్యే శ్రీ‌కారం చుడుతున్నారు. ప్రొద్దుటూరు మున్సిప‌ల్ కార్యాల‌యం ఎదుట ఇవాళ ఆయ‌న దీక్ష‌ను ప్రారంభించారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో కార్యకర్తలు, నాయకులను కలుపుకుని ముందుకు పోతూనే  రాచ‌మ‌ల్లు ప్రజా ఉద్యమం సాగిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పట్టణంలో తీవ్రంగా నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలతో కలిసి జల దీక్ష చేపట్టారు.  ఆగస్టులో జనవాసాల మధ్య మద్యం షాపులు ఎత్తి వేయని నేపధ్యంలో ప్రజా సంఘాలతో కలిసి దీక్షకు కూర్చొన్నారు. ఇటీవల చేనేత కార్మికులకు సంబంధించిన పింఛన్లు మంజూరు చేసినా టీడీపీ ప్రొద్దుటూరు నాయకుడు అడ్డుకుంటున్న వైనాన్ని వివరిస్తూ వెంటనే అర్హులకు పింఛన్లు అందించాలని మూడు రోజులపాటు మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో ఆందోళన చేశారు.ప్రభుత్వం దిగివచ్చేలా చేశారు. ఇలా ప్రతినిత్యం ప్రజల బాటలోనే నడుస్తున్నారు.

మ‌హానేత మాదిరిగా ఉచితంగా ఇల్లు నిర్మించాలి..
దివంగత సీఎం వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి తరహాలోనే ప్రజలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి అందించాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి దీక్ష చేప‌ట్టారు.  ప్రభుత్వం అందిస్తున్న మొదటి రకం గృహాలకు సంబంధించి రూ. 3.25 లక్షలు రుణం కాగా, సబ్సిడీ కింద కేంద్రం రూ. 1.50 లక్షలు.. రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.50 లక్షలు కలుపుకుని మొత్తం రూ. 6.25 లక్షలు మంజూరు చేస్తున్నారు. అయి తే ఆ సొమ్మును 30 ఏళ్లలోపు చెల్లించేలా ఒప్పందం రాసుకుంటున్నారు. అయితే 30 ఏళ్లకు దాదాపు లెక్కలు వేస్తే రూ. 18 లక్షలు అవుతోంది. అంటే ప్రతినెల కంతు కింద రూ. 3500– 4000 వరకు కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి కాకుండా మ‌హానేత మాదిరిగా ఉచితంగా ఇల్లు నిర్మించి ఇవ్వాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. 

 public issuesysrcp leadars