దళితులకు అండగా వైయస్సార్సీపీ
9 Sep, 2017 15:04 IST
విజయనగరం: దళితుల భూముల ఆక్రమణే తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున విమర్శించారు. కొవ్వాడలోని వివాదస్పద భూములను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా దళితుల భూములను ప్రభుత్వం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదా ప్రత్యామ్నాయ స్థలమైనా ఇవ్వాలన్నారు. న్యాయం జరిగే వరకు దళితులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు