రైతుల ఆందోళనకు వైయస్‌ఆర్‌సీపీ మద్దతు

9 Nov, 2018 11:44 IST
పశ్చిమ గోదావరి: కొయ్యలగూడెం మండలం రాజవరంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రీన్‌ఫీల్డ్‌ హైవే భూ సేకరణ నేపథ్యంలో అధికారులతో రైతుల వాగ్వాదం చోటు చేసుకుంది. రైతుల ఆందోళనకు వైయస్‌ఆర్‌సీపీ మద్దతు తెలిపింది. దీంతో రాజవరంలో భారీగా పోలీసులు మోహరించారు.