వైయస్సార్సీపీ నూతన నియామకాలు
4 Jul, 2016 11:29 IST
హైదరాబాద్ః వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా, రేపల్లె నియోజకవర్గానికి సంబంధించిన పలువురిని పార్టీ ఆయా పదవులలో నియమించింది. బిసి సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బొర్రా శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బడుగు చంద్రపాల్, రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా యం దివాకర్ రత్నప్రసాద్, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా షేక్ సిరాజుద్దీన్, జిల్లా పార్టీ కార్యదర్శిగా కొడాలి రంగనాయకులు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ అదనపు సమన్వయకర్తగా వలవల మల్లికార్జునరావు, గుంటూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా డైమండ్ బాబులను నియమించడమైనది.