వైయస్ఆర్ సీపీ ఎంపీలకు విప్ జారీ
17 Mar, 2018 12:37 IST
ఢిల్లీ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ఎంపీలకు విప్ జారీ చేశారు. సోమవారం అవిశ్వాస తీర్మానికి మద్దతుగా నిలబడాలని పార్టీ ఆదేశించింది. పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎంపీలు కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాల్సింది ఉంటుంది. లేనిపక్షంలో వారిపై అనర్హత వేటు పడనుంది.