హోదా సాధించే వరకూ సైనికుల్లా పనిచేస్తాం

7 Apr, 2018 11:31 IST
ఢిల్లీ: ఐదుకోట్ల మంది ఆంధ్రలు హక్కు ప్రత్యేక హోదా సాధించే వరకూ సైనికుల్లా పోరాడుతామని కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుతున్న పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారని, హోదాతో సహా విభజన హామీలన్నీ అమలు చేయాని అవినాష్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. అప్పటి వరకూ తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరో ఎంపీ మిథున్‌ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ఎంపీలు దొంగ దీక్షలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తమకు పదవుల కంటే ప్రజలే ముఖ్యమని అన్నారు.