ట్విట్టర్ వేదికగా చంద్రబాబును ప్రశ్నించిన ఎంపీ విజయసాయి రెడ్డిరాష్ట్రంలో కనీవినీ ఎరుగుని రీతిలో కరువు తాండవిస్తోందని వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు.ట్విట్టర్ వేదికగా చంద్రబాబును ప్రశ్నించారు. 320 మండలాలను కరువు కాటేసిందని ఆదుకునే దిక్కులేక సీమలో వేల సంఖ్యలో వలసలు మొదలయ్యాయన్నారు. ఊళ్లకు ఊళ్లే ఖాళీ అవుతున్నాయని అన్నదాతల ఆక్రోశం పట్టించుకోని నీరో(నారా) చక్రవర్తి మాత్రం కూటమి రాజకీయాల్లో తలమునకలైపోయారన్నారు.