ప్రాజెక్టులు నిర్మిస్తే..కరువెందుకు వచ్చింది బాబూ?

27 Aug, 2018 12:22 IST

వైయస్‌ఆర్‌ జిల్లా:  చంద్రబాబు చర్యల వల్ల రైతులు ఖరీఫ్‌ సాగు మర్చిపోయారని ఎమ్మెల్సీ గోవిందరెడ్డి విమర్శించారు. కడపలో జలశయాలు కట్టానని చంద్రబాబు చెబుతున్నారని, ప్రాజెక్టులు నిర్మిస్తే జిల్లాలో కరువు ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ జిల్లాలో కరువు మండలాలను ప్రకటించింది మీరు కాదా అని నిలదీశారు.