తిరుపతి: ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పలువురు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్యేలు అనిల్కుమార్, జోగులు వీఐపీ దర్శనంలో శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి వారిని ఆశీర్వదించారు. ప్రజలు సుఖశాంతులతో జీవించాలని వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని స్వామివారిని కోరామని ఎమ్మెల్యేలు తెలిపారు.