గిడ్డి ఈశ్వరిపై అనర్హత వేటు వేయాలి
13 Dec, 2017 13:13 IST
విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇటీవల పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై అనర్హత వేటు వేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముస్తాఫాలు అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీకి పిటీషన్ అందజేశారు