ఏడాది తర్వాత అసెంబ్లీకి హాజరైన ఎమ్మెల్యే రోజ
6 Mar, 2017 11:21 IST
వెలగపూడి: అమరావతిలో జరిగే నూతన అసెంబ్లీ సమావేశాలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా హాజరయ్యారు. ఏడాది సస్పెన్షన్ అనంతరం మళ్లీ తిరిగి 2017-18 బడ్జెట్ సమావేశాలకు రోజా హాజరయ్యారు. కాల్మనీ సెక్స్రాకెట్పై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీసినందుకు రూల్స్కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే రోజాను అధికార పక్షం ఏడాది సస్పెండ్ చేసిన విషయం విధితమే.