మున్సిపల్ ఆఫీసు ఎదుట ఎమ్మెల్యే బైఠాయింపు
13 Feb, 2017 11:27 IST
వైయస్ఆర్ జిల్లాః ప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీసు ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తాగునీటి సమస్యలపై జలదీక్ష చేపట్టగా మున్సిపల్ అధికారులు శిబిరాన్ని తొలగించారు. అధికారుల తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే మున్సిపల్ ఆఫీసు ఎదుట బైఠాయించారు. రాచమల్లుకు మద్దతుగా మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు.