వైయస్ జగన్ మాట తప్పని వ్యక్తి అని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. ఆంధ్రుల అభిమానాన్ని తాకట్టు పెట్టకుండా ధైర్యంగా పోరాడుతున్నందుకు ఆయన వ్యక్తిత్వంపై దాడి జరుగుతుందన్నారు. జగన్ ఎవరిని మోసగించే వ్యక్తి కాదని, జగన్నే 23 మంది ఎమ్మెల్యేలు మోసగించారన్నారు. 2014లో ఓదార్పు యాత్రలో రాజకీయ ఉపన్యాసాలు చేయాలని సోనియాగాంధీ ఆదేశాలు జగన్ వినలేదనే నెపంతో కుట్ర,కుతా్రంతాలతో కేసుల్లో ఇరికించారని విమర్శించారు. సోనియాగాంధీ మాట వినకపోవడం వల్లనే కేంద్రమంత్రి పదవి రాలేదని వ్యాఖ్యనించిన గులాంనబీ అజాద్ మాటలను గుర్తుచేశారు. దుర్మార్గంగా కుతా్రంతాలు రాజకీయా కారణంతో కేసులు పెట్టారు. టీడీపీ, కా్రంగెస్ కుమ్మక్కై జగన్పై కేసులుపెట్టారన్నారు. లక్ష కోట్లు అన్నవారు 11 వందల కోట్లు మీద కూడా చార్జీషీటు దాఖలు చేయలేదని, ఒక కేసులో కూడా తీర్పు రాలేదన్నారు.