ప్రత్యేక హోదా మన హక్కు
30 Apr, 2018 17:43 IST
విశాఖ: ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. విశాఖ దీక్షలో ఆమె మాట్లాడారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందన్నారు. హోదా తెస్తామని ఓట్లు వేయించున్న చంద్రబాబు మోసం చేశారన్నారు. వైయస్ జగన్ పోరాటాల ఫలితంగా ప్రత్యేక హోదా అంశం సజీవంగా నిలిచి ఉందన్నారు. హోదా రాకుండా చేయడంలో టీడీపీ, బీజేపీలు రెండూ ద్రోహులే అన్నారు.