మల్కాజ్గిరి పార్టీ ఎంపీ అభ్యర్థిగా దినేశ్రెడ్డి
8 Apr, 2014 13:57 IST
హైదరాబాద్ :
మల్కాజ్గిరి లోక్సభా స్థానం నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ డీజీపీ వి.దినేశ్రెడ్డి పోటీ చేస్తారని పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు సోమవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. వైయస్ఆర్సీపీ అభ్యర్థిగా ఈ నెల 9న తాను నామినేషన్ దాఖలు చేయనున్నట్లు దినేశ్రెడ్డి తెలిపారు.