శబరిమలలో వైయస్సార్‌సీపీ నేతల పూజలు

19 Apr, 2017 19:24 IST

భామిని: వైయస్సార్‌సీపీ మరింత బలోపేతమవ్వాలని కోరుతూ ఆ పార్టీ నేతలు శబరిమల అయ్యప్ప సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. వైయస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు తోట సింహాచలం, రైతు విభాగం అధ్యక్షుడు బోదెపు శ్రీనివాసరావులు అయ్యప్ప జన్మదినం సందర్భంగా ప్రత్యేక దర్శనాలు చేసుకున్నారు. పార్టీ విజయపథంలో నడవాలని మొక్కులు తీర్చుకున్నారు.