యర్రవంకలవారిపల్లి,(ఎన్పీకుంట): మండల పరిధిలోని యర్రవంకలవారిపల్లి గ్రామంలో గ్రామ సర్పంచు ఆదినారాయణరెడ్డి కుమారుడు హరినాథ్రెడ్డి వివాహవేడుకల్లో వైయస్ఆర్సీపీ నాయకులు గురువారం హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ఏర్పాటు చేసిన విందుభోజనంలో అందరూ పాల్గొన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ డా,పి.వి.సిద్దారెడ్డి,మాజీ మంత్రి మహమ్మద్షాకీర్,వైఎస్ఆర్ కాంగ్రేస్పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి వజ్రభాస్కర్రెడ్డి, డీసీఎంఎస్ డైరెక్టర్ టి.జగదీశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.