చిత్తూరు: ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రాణాలు విడిచిన మదనపల్లెలో సుధాకర్ (26) ఆత్మహత్య చేసుకున్నారు. హోదా మన హక్కు అంటూ లేఖ రాసి మరీ సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడి కుటుంబసభ్యులను వైయస్ఆర్ సీపీ మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డిలు పరామర్శించారు. మృతుడి కుటుంబీలకు రూ. లక్ష చొప్పున మిథున్రెడ్డి, తిప్పారెడ్డిలు ఆర్థిక సాయం చేశారు.